మోమిన్పేట : గ్రామల్లో ప్రజలు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గోవిందపూరం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి జీవరాసుల పట్ల భక్తి శ్రద్ధలతో ధానగునాలతో ఉండాలన్నారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశమ్మ, ఎంపీటీసీ కృష్ణ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.