వికారాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం మూలంగా నేడు రాష్ట్రంలో అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు చేపలతో కళకళలాడుతూ గంగపుత్రుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల్లి చెరువులో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి 2.31 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ వృత్తుల అభివృద్ధిలో భాగంగా పక్కా ప్రణాళికతో చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి వాటి ఫలాలు ప్రజలకు సీఎం కేసీఆర్ అందేలా కృషి చేస్తున్నారన్నారు. మత్స్యసంపద మరింత పెరిగి గంగపుత్రులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. అనంతరం మత్స్యశాఖ సంఘం సభ్యులను పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, తాసిల్దార్ కృష్ణయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.