తాండూరు : ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం (2022)ను పురస్కరించుకొని ఆదివారం తాండూరు పట్టణంలో పోలీస్, పాత్రికేయులు క్రికెట్ పోటి పెట్టుకున్నారు. రసవత్తరంగా జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్లో విలేకలర్లపై పోలీసులు విజయం సాధించారు. గెలుపొందిన పోలీసులతో పాటు ఉత్సాహంగా పోటీలో తలపడ్డ మీడియా టీంకు డీఎస్పీ లక్ష్మినారాయణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఓటమి గెలుపునకు నాంది అని పేర్కొన్నారు.
గెలుపొందిన పోలీస్ టీంను అభినందించారు. ఇదే ఉత్సవంతో పోలీసులు మరింత శ్రద్ధతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, రూరల్ సీఐ జలేందర్రెడ్డి, పాత్రికేయులు, పోలీసులు ఉన్నారు.