వికారాబాద్ : దసరా ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణం ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి దేవాలయంలో స్వామివారు శుక్రవారం హనుమంత వాహనంపై ఊరేగారు. భక్తులు స్వామివారి పల్లకి సేవను మోస్తూ స్వామినామస్మరణతో ఆలయ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు లో అర్చకుల మంత్రోచ్ఛరనలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పల్లకీ సేవలో పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.