వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిలతో శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డిని హైదరాబాద్లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా పార్టీ సిద్ధాంతాలకు, పటిష్టతకు పాటుపడతానని, అప్పగించిన బాధ్యతలను తప్పకుండా పాటిస్తాని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. వీరితో పాటు టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఉన్నారు.