పరిగి : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా స్వామి వారి విగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిగి, చేవెళ్ల, వికారాబాద్ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు. అంతకుముందు హోమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఈ ఉత్సవాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.