కోట్పల్లి : రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం రాంపూ ర్ సమీపంలో టీవీఎస్పై వెలుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగప్ప (65) ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో నాగప్ప తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే హైదరాబాద్లో ఓ ప్రైవేటు దవాఖానకి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబానికి కొత్తపల్లి సర్పంచ్ ఆర్థిక సాయం చేశారు.