వికారాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మున్సిపల్లో 100శాతం పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ మంజుల ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ వికారాబాద్ పట్టణ పరిధిలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జిల్లాలోనే మొదటి మున్సిపల్గా నిలిచేందుకు కృషి చేయాలని కోరారు.
ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి, వీలైనంత తొందరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ కృష్ణ, మెడికల్ ఆఫీసర్ వినోద్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆశవర్కర్లు, స్పెషల్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.