కొడంగల్ : ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా 29, 30వ తేదీల్లో రెండు రోజులు జరుగవని నోడల్ అధికారి శంకర్ తెలిపారు. ఎన్నికలకు గాను శుక్రవారం, శనివారం పరీక్షలు రద్దు చేయగా, ఆదివారం ఎకనామిక్స్, సివిక్స్ పరీక్ష యథావిధిగా ఉదయం 9నుంచి 12గంటల వరకు కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇట్టి గమనికను విద్యార్థులు గ్రహించి ఆదివారం జరిగే పరీక్షకు సమయానికి హాజరు కావాలని సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీని పరీక్షలు ముగించనున్నట్లు స్పష్టం చేశారు.