వికారాబాద్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి దేవాలయంలో 9రోజులుగా అనంతపద్మనాభుడు వివిధ రకాల పూజలందుకున్నారు. దసరా ఉత్సవాలు ముగియడంతో ఆదివారం ఆలయం నుంచి అనంతగిరిగుట్టకు పల్లకి సేవలో బయలు దేరారు. భక్తులు స్వామివారి పల్లకి సేవను మోస్తూ ఆలయం వరకు చేరుకున్నారు. స్వామివారు వెళ్లే దారిని భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మంగళహారతులు పట్టారు.