మోమిన్పేట : మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక దైవచింతనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కలసిమెలసి అనందంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు.
కల్యాణ మహోత్సవానికి ఆయా గ్రామల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోని స్వామి వారి కృపకు ఆశీనులైనరు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, ఎంపీటీసీ కృష్ణ రెడ్డి, సర్పంచులు హరి శంకర్ నాయకలు పాల్గొన్నారు.