కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప స్వామికి 20వ మహాపడి పూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కులకచర్ల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడిపూజ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. ఉదయం యజ్ఞం, పూర్ణాహుతి, అభిషేకం, స్వామివారి భజనలు, అనంతరం మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహాపడిపూజ కార్యక్రమానికి అయ్యప్పస్వాములతో పాటు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దేవాలయం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. అయ్యప్ప స్వాములు ఐక్యంగా ఉంటూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. అయ్యప్పస్వామి మహాపడిపూజ సందర్భంగా వచ్చిన భక్తులకు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు. అయ్యప్పస్వామి దేవాలయం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది.
కార్యక్రమంలో కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ కులకచర్ల మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, డాపూర్ మండల సుధాకర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, వివిధ గ్రామాల అయ్యప్పస్వామి భక్తులు, అయ్యప్పస్వాములు, అయ్యప్పభక్తులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.