వికారాబాద్ : ఎన్నికల స్పెషల్ క్యాంపును కొన్ని రోజుల క్రితం వికారాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ ఐఏఎస్ మేఘన టౌన్షిప్, రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓటర్ నమోదు చేసుకున్న వారి ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. 1 జనవరి 2022 నాటిని 18సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేసుకున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు.
చిరునామా మార్పు చేసుకున్నవారు, పేర్లు సరి చేసుకున్నవారి, పుట్టిన తేదీ సరి చేసుకున్నవారి ఇంటి వద్దకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించి పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మోతీలాల్, డిప్యూటీ తాసిల్దార్ విజయేందర్, ఆర్ఐ విజయ్లు ఉన్నారు.