వికారాబాద్ : శానిటేషన్ సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి, వారిని గౌరవించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో శానిటేషన్ సిబ్బంది తమ విధులను అంకిత భావంతో పని చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సఫాయన్న నీకు సలాం అంటు కార్మికుల సేవలను గుర్తించిందన్నారు.
ప్రతీ సంవత్సరం నిత్యవసర వస్తువులు అందించడం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది సేవలు కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కమిషనర్ శరత్చంద్ర, వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.