పూడూరు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో జరిగిన తిరుమలనాథస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్గుప్తా, సర్పంచ్ శ్రీధర్గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవలయాలను సందర్శిస్తే మన్నశాంతి పొందవచ్చాన్నారు. నేటి యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ భక్తిమార్గం అలవరుచుకోవాలన్నారు. సంస్థాన్ పీఠాధిపతి వెంకటదాసుల ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఉత్సవాలు కొనసాగుతుండగా ప్రతి రోజు పలు ప్రాంతాల భక్తులు పాల్గొని రాకంచర్ల సంకీర్తనలతో భజనలు చేశారు.
ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జాతర ఉత్సవాల సందర్భంగా రాంచందర్ స్మారకార్థంతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో సుమారుగా ఆయా ప్రాంతాల నుంచి 35 టీంలు పాల్గొన్నాయి. ఆర్గనైజర్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పోటీలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు రైతు సమన్వయ మండల కన్వీనర్ రాజేందర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, ముకంటి ఉన్నారు.