పరిగి : పరిగి పట్టణంలో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆదివారం పరిగిలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ గొప్ప ప్రజాస్వామికవాది అని కొనియాడారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజకులకు ఐరన్బాక్సులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.