పరిగి : మైసమ్మగడ్డతండాకు వెళ్లే రహదారిలో వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగి మండలం మైసమ్మగడ్డ తండాకు వెళ్లే రహదారిని ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలంలో వాగు వస్తే తండాకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంటుందని తండావాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాగుపై వంతెన నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచ్ గణేష్ పాల్గొన్నారు.