ధారూరు, జూలై 26 : వారం రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోట్పల్లి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతున్నది. ప్రాజెక్టు వర్షపు నీరు నిండి అలుగు పారుతున్నది. కురిసిన వర్షాలకు ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో ఉన్న రోడ్డు దెబ్బతిన్నది. నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్య ఉన్న వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. మండల పరిధిలోని దోర్నాల్-ధారూరు స్టేషన్ గ్రామాల మధ్య ఉన్న(కాగ్నా) వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో నాగసముందర్, అల్లాపూర్ గ్రామాలు, దోర్నాల్, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మరిపల్లి, పులిచింతలమడుగుతండా, శేరిగడ్డతండా, జీడిగడ్డతండా, యాలాల మండలం రాస్నం గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.