చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 15 : సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకులకు భరోసా కల్పిస్తూ వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని అంతారం, కౌకుంట్ల, ఆలూరు, తల్లారం, హస్తేపూర్, మీర్జాగూడ గ్రామాల్లో గురువారం నూతన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీవో రాజ్కుమార్తో కలిసి అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ పాలనలో అర్హులందరికీ పింఛన్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి పక్షాల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, సర్పంచ్లు సులోచన, గాయత్రి, విజయలక్ష్మి, సురేందర్, వెంకటయ్య, భీమయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, కౌకుంట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతకింది నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు శేఖర్, ఎంపీటీసీలు సుజాత, నరేందర్, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్ద పీట
శంకర్పల్లి : పేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. గురువారం మండలంలోని మహలింగాపురం, గాజలగూడ, లక్ష్మారెడ్డిగూడ, అలంఖాన్గూడ, రావులపల్లి, చందిప్ప, ఎల్వర్తి గ్రామాల్లో ఆసరా పింఛన్ కార్డులను లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్లు మాణిక్యరెడ్డి, మౌనిక, పావని, సత్యనారాయణ, స్వప్న, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
నందిగామ : పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ, తళ్లగూడ, కన్హా, వీర్లపల్లి, ఈదులపల్లి, మొత్కులగూడ, మామిడిపల్లి, మొదళ్లగూడ, శ్రీనివాసులగూడ గ్రామాలు, కొత్తూరు మండలంలోని పెంజర్ల, ఇన్ముల్నర్వ, సిద్దపూర్, ఎస్బిపల్లి, కొడిచర్ల, కొడిచర్లతండా, వైఎం తండా గ్రామాలకు చెందిన 759 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ కార్డులను గురువారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీపీలు ప్రియాంక, మధుసూదన్రెడ్డి, వైస్ ఎంపీపీ శోభ, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణ, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరికలు
కొడిచర్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మామిడిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య, మొదళ్లగూడ గ్రామానికి చెందిన యాదయ్యకు దళిత బంధు పథకం ద్వారా కొనుగోలు చేసిన ఆవులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు.