ధారూరు : రైతులకు జాతి ఆహార భద్రత మిషన్ పథకం కింద వేరుశనగలు పంపిణీ చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ అన్నారు. గురువారం ధారూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు జాతి ఆహార భద్రత మిషన్ పథకం కింద వేరుశనగ సంచులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ మాట్లాడుతూ రైతులు వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. రైతులకు ప్రత్యమ్నాయ పంటల కింద కుసుమలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వికారాబాద్ డివిజినల్ వ్యవసాయశాఖ అధికారి వినోద్కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు సంజువ్రాథోడ్, రైతులు పాల్గొన్నారు.