తాండూరు రూరల్ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన తాండూరు మండ లం, గౌతాపూర్, కోటబాసుపల్లిల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం పనులను పరిశీలించి మా ట్లాడారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎంపీడీవో సు దర్శన్రెడ్డిని ఆదేశించారు. ఆయన వెం ట డీఈఈ వెంకట్రావు, ఏఈ సంతో ష్, ఎంపీవో రతన్సింగ్, సర్పంచ్లు రాజప్ప, నాగార్జున ఉన్నారు.
ప్రతినెలా నీటి లెక్కలు
వికారాబాద్ : జిల్లాలో భూ గర్భ జల వనరుల లెక్కలు ఇక నుంచి కచ్చితంగా తేలుస్తాయని అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రా మంలో ఫీజోమీటర్లను (జల మట్టం తెలిపే బావులు) ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 23 ఉండగా, వాటర్ షెడ్ పరిధిలో 39 ఉన్నాయన్నారు. ఫీజోమీటర్ల ద్వారా ప్రతినెలా నీటి లెక్కలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఆయనతోపాటు జిల్లా భూగర్భ జల అధికారి జి.దీపారెడ్డి, డాక్టర్ కె.భాగ్య, లావణ్య, సర్పంచ్ రఫీ తదితరులు పాల్గొన్నారు.