వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్ నిఖిల స్వామివారికి పట్టు వస్త్రాతలు సమర్పించి ప్రత్యేకపూజ కార్యక్రమలు నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఆలయ అధికారులు ఈవో నరేందర్, అర్చకులు ఉన్నారు.