వికారాబాద్, ఫిబ్రవరి 10 : బీయూ, వీవీ ప్యాట్లు, సీయూ మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగిని సందర్శించి బీయూ, వీవీ ప్యాట్లు, సీయూల మొదటి స్థాయి పరిశీలన చేశారు. కలెక్టర్ ఎన్నికల సిబ్బందిని వివిధ విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆరు రోజులుగా ఈవీఎంల మొదటి పరిశీలనలో భాగంగా ఇప్పటికీ బీయూలు 45 శాతం, వీవీ ప్యాట్లు 50 శాతం, సీయూలు 60 శాతం ఎఫ్ఎల్సీ పూర్తైందన్నారు. మిగతావి నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసేందుకు ఈసీఐఎల్కు చెందిన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో విజయ్కుమారి, మండల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.