ధారూరు : బాల్య వివాహాలు చేయరాదని, ఎవరైనా బాల్య వివాహాలు చేసిన, వారికి సహాకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ధారూరు ఎంపిడీవో ఉమాదేవి అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ధారూరు ఎంపిడీవో అధ్యక్ష్యతన చైల్డ్లైన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధారూరు ఎంపీడీవో ఉమాదేవి మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో మండల పరిధిలోని బాల్యవివాహాలు తగ్గడం మంచి పరిణామమని అన్నారు. మండల పరిధిలోని బాలికలు ఉన్నత విద్యకోసం పోటీ పడటం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
మండలంలో చాలామంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులై అందుబాటులో కళాశాల లేకపోవడంతో చదువు మానిసి ఉన్నారని తెలిపారు. మండలంలో ప్రత్యేకంగా బాలికలకు కళాశాల ప్రారంభించేలా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకేళ్తామని తెలిపారు. మండలంలోని పెద్ద పంచాయతీలలో గ్రామస్తులకు మండలస్థాయి అధికారులతో బాలల సమస్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా పాటించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. హాస్టల్లో విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయాలని వార్డన్కు సూచించారు.
కార్యక్రమంలో ధారూరు డిప్యూటీ తాసిల్దార్ వెంకటయ్య, చైల్డ్లైన్ జిల్లా కో- ఆర్డినేటర్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుశీల, హెల్త్ సూపర్ వైజర్ సురేందర్, హాస్టల్ వార్డన్ ఉమెన్ధర్, ఉపాధ్యాయులు, చైల్డ్లైన్ సిబ్బంది సంజమ్మ పాల్గొన్నారు.