కొడంగల్ : పేద ప్రజల ఆరోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి చికిత్స నిమిత్తం ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ కరీంకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 80వేల ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్యాదవ్ పాల్గొన్నారు.