పరిగి : తెలంగాణ రాష్ట్రానికి 20ఏండ్లు సీఎంగా కేసీఆరే ఉంటారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కలలు సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ రాబోయే 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పారు. బుధవారం పరిగిలోని బృందావన్ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్లో నవంబర్ 15న నిర్వహించే విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి బస్సు ఏర్పాటు చేస్తున్నమని తెలిపారు.
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ బస్సుల్లోనే రావాలని వారి సొంత వాహనాలు ఎవరే తీసుకరావొద్దని సూచించారు. పెద్ద గ్రామాలుంటే అదనంగా బస్సులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి మండలంలో పార్టీ కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ గ్రామానికి ఎన్ని బస్సులు అవసరమో జాబితా తయారు చేసి ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా బస్సుల కేటాయింపు చేపడతామని తెలిపారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సూచనలతో విజయగర్జన సభకు అందరూ సిద్ధమవ్వాలని కోరారు.
త్వరగా బయలుదేరడం ద్వారా సభ ప్రాంతానికి ముందుగా వెళ్లగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, హరిప్రియ, శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్లు సురేందర్, హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.