పరిగి : రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సూచించారు. మంగళవారం పరిగి మండలం చిగురాల్పల్లి, రంగంపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు సన్న ఒడ్లు, దొడ్డు ఒడ్లను వేర్వేరు రోజుల్లో తీసుకువచ్చేలా రోజులు కేటాయించాల్సిందిగా సూచించారు. టోకెన్లు ఆయా రోజుల వారిగా అందజేయాలని అన్నారు.
రెండు రకాల ఒడ్లు కొనుగోలు చేయడం జరుగుతుందని, సన్న ఒడ్లను ఏఏ వారాలలో కొనుగోలు చేస్తారనేది తెలియజేసి ఆయా తేదీలలో తీసుకురావడానికి టోకెన్లు అందించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పరిగి ఏడీఏ రాధిక, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.