వికారాబాద్ : నూతన సంవత్సరం సదర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ను శనివారం క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఆనంద్కు తినిపించారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన వారు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మంజుల రమేశ్ కుమార్, వైస్ చైర్పర్సన్ శంషాద్భేగం ముత్తహర్షరీఫ్, ఎంపీడీవో సత్తయ్య, తాసిల్దార్ కృష్ణయ్య, ఎంపీవో నాగరాజు, కౌన్సిలర్లు నవీన్కుమార్, చందర్నాయక్, రాములు, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, పోలీస్ అధికారులు ఉన్నారు.