మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శనైశ్వర ఆలయంలో గురుస్వామి సుధాకర్గౌడ్, యాదగిరి సమాక్షంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అయ్యప్పస్వామికి ప్రత్యేపూజలు, పంచామృతాల అభిషేకాలు ఘనంగా జరిపించారు. ఇతర ప్రాంతాల మాలాదారణ స్వాములు ఈ పడిపూజ మహోత్సవానికి వచ్చి స్వామి వారి ఆటపాటలతో తిలకించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్కతల స్వాములు శ్రీనివాస్రెడ్డి, కృష్ణరెడ్డి, ఎల్లారెడ్డి, మహిపాల్రెడ్డి, శ్రీకాంత్గౌడ్, పాపిరెడ్డి, చంద్రామోహన్రెడ్డి, మల్లారెడ్డి, నర్సింహా రెడ్డి, ఇతర గ్రామాల స్వాములు పాల్గొన్నారు.