వికారాబాద్ : రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యల కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగ నడుచుకోవాలని, బాధితులకు సరైన న్యాయం చేసి పోలీస్ శాఖపై నమ్మకం కలిగే విధంగా చూడలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు జరుగకుండా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నేరాల సంఖ్యను తగ్గించే విధంగా చూడాలన్నారు.
కేసులకు సంబంధించిన పలు విషయాలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.