బొంరాస్ పేట : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని తుంకిమెట్ల మాజీ సర్పంచ్ లక్ష్మణ్, రాజునాయక్, కిషన్, బాల్రాం, కొత్తూరు గ్రామానికి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం బొట్లవానితండాలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకుపోతూ నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. గిరిజన తండాలకు త్వరలో రహదారులను, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తామని అన్నారు. మండలంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఐదు తండాలకు రోడ్లు వేయడానికి ప్రభుత్వం అనుమతి తీసుకుని రోడ్లు నిర్మిస్తామన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, ఎంపీటీసీ శ్రవణ్గౌడ్, తాలుకా, మండల యూత్ అధ్యక్షులు నరేశ్ గౌడ్, మహేందర్ పాల్గొన్నారు.