పరిగి టౌన్ : ఏడో విడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమచేయడంతో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి నివాసం దగ్గర సీఎం కేసిఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేష్రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని రైతుల పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పెట్టుబడి సహాయం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు.
కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్కుమార్, నాయకులు మీర్మహిమూద్అలీ, రాజేందర్ పాల్గొన్నారు.