మోమిన్పేట : కార్తీక మాసం చివరి రోజు శనిఅమావాస్య సందర్భంగా మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో కొలువుదీరిన శనేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. శని అమావాస్య రోజు శనైశ్వర స్వామిని దర్శించుకుంటే శనిదోసం పోతుందని భక్తులు విశ్వసిస్తారు. శనివారం ఉదయం నుంచి హైదారాబాద్, కర్ణాటక, మహరాష్ట్ర నుంచి సైతం వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు స్వామివారికి ఇష్టమైన తైలాభిషేకాలతో అభిషేకాలు జరిపించినట్లు ఆలయా ఈవో శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్వామివారిని దర్శించుకుని స్వామి వారి కృపకు ఆశీనులైనట్లు ఆయన తెలిపారు.
ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అన్నాదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో తెలిపారు. అదే విధంగా మండల పరిధిలోని రాళ్లగూడుపల్లి గ్రామంలో వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు వీరేశం పంతులు తెలిపారు.