మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో సోమవారం శివుడి ఘట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. శివస్వాములు గ్రామంలోని ఆంజనేయస్వామి మందిరం నుంచి ఆటపాటలతో శనైశ్వర ఆలయంలోని నర్మధ మతా ఆలయం వరకు చేరుకుని 101 కలషాలతో శివుడికి ఘట్టాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఎన్కతల శివ మలధారణ సన్నిధి బృందం, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన స్వాములు, భక్తులు పాల్గొన్నారు.