వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి కార్తీకమాసం పెద్ద జాతర ముగియడంతో స్వామివారి హుండిని మంగళవారం లెక్కించారు. 28రోజుల పాటు ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. జాతరలో భక్తులు తమ తమ కానుకలను హుండీలో వేసి వారి వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయల ఆవరణలో అధికారులు హుండీని లెక్కించారు. రూ. 6,31,056లు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నరేందర్, కొడంగల్ ఈవో బాలరాజు, జూనియర్ అసిస్టెంట్ శాంతకుమార్, స్థానిక పోలీసులు, భక్తులు పాల్గొన్నారు.