వికారాబాద్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు బాలాత్రిపురసుందరీగా భక్తులకు దర్శణమిచ్చారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ నైవేద్యాలు సమర్పించారు. వికారాబాద్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో అమ్మవారిని ప్రతిష్టించిన భక్తులు నిత్యపూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శణమిస్తారని అర్చకులు తెలిపారు.