వికారాబాద్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో దుర్గామాతకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు కడియాల వేణుగోపాల్, శంచద్రశేఖర్ ఉన్నారు.