పరిగి : ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అందరు ఉత్తీర్ణులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. తద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 9237మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవగా వారందరూ ఉత్తీర్ణులైనట్లు పేర్కొనవచ్చు. ఈ నెల 16న ప్రకటించిన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలలో 2,651మంది ఉత్తీర్ణులయ్యారు. తద్వారా 29శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిలైన విద్యార్థులందరూ 35 మార్కులతో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వికారాబాద్ జిల్లా నుంచి జనరల్కు సంబంధించి మొత్తం 8177మంది, ఓకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 1060మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 2651మంది మొదట ప్రకటించిన ఫలితాలలో ఉత్తీర్ణులవగా మిగతా 6586మంది విద్యార్థులు సైతం పాస్ అయ్యారు.