వికారాబాద్ : ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఛత్తీస్ఘడ్ వాసి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం కన్యలాల్భాగ్ కాలనీలో ఈశ్వర్ అలియాస్ లలిత్ (45) ఓ ఇంటి రేలింగ్ నిర్మాణ పనులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు జారి మెట్లపై పడడంతో తలకు, వీపు కింది భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఛత్తీస్ఘడ్ నుంచి బతుకుదెరువు కోసం వికారాబాద్కు కుటుంబ సభ్యులతో వలస వచ్చి రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య సంతోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీను తెలిపారు.