ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఐఐసీ బాలమల్లును టీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు వడ్ల నందు కోరారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో వారి నివాసంలో కలిసి నాగసముందర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా సానుకులంగా స్పందించి, వికారాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడినట్లు వారు తెలిపారు. వీరి వెంట నాయకులు అంజనేయులు, కృష్ణ ఉన్నారు.