మొయినాబాద్, జూలై12: మండల ప్రాదేశిక సభ్యులపై అనర్హత వేటు పడటానికి కారణం ఎంపీడీవో అని, అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ సభ్యులు సర్వసభ్య సమా వేశా న్ని బహిష్కరించారు. ఎంపీడీవోను ఇక్కడ నుంచి బదిలీ చేయాలని సభ్యులు సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం మం డల పరిషత్ అధ్యక్షురాలు గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. ఎజెండాలోని అంశాలను శాఖల వారిగా చర్చించ డానికి అధ్యక్షురాలు అనుమతించగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి ఎంపీటీసీల అనర్హత వేటుపై సరైన సమాధానం అధికారులు చెప్పే వరకు సభ నిర్వహించరాదన్నారు. ఎంపీడీవోను ఇక్కడి నుం చి బదిలీ చేయాలంటూ సభలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని సభా ధ్యక్షురాలు నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్కు అందజేశారు. అనం తరం సభ్యులు సభను బహిష్కరిస్తున్నామని బయటకు వెళ్లిపో యారు. సభను వాయిదా వేస్తున్నామని ఎంపీపీ ప్రకటించడంతో అధికారులు, సర్పంచ్లు వెళ్లిపోయారు. ఎంపీడీవోను మొయినాబాద్ నుంచి బదిలీ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని ఎంపీటీసీలు వెల్లడించారు,