తాండూరు : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, టీకాపై నిర్లక్ష్యం చేయడం పద్దతికాదని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను ఆర్డీవో అశోక్కుమార్, స్పెషల్ ఆఫీసర్ హన్మంతరావు, తాసీల్దార్ చిన్నప్పల నాయుడుతో కలిసి తనిఖీ చేశారు. తాండూరు సెంటర్లలో వ్యాక్సినేషన్ లేకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఎవరికి పట్టనట్లు ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండడం చాల తప్పిదమన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది విధిగా ప్రజలను అవగాహన పరుస్తు వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ఈ నెల చివరి వరకు 100శాతం వ్యాక్సిన్ పూర్తి కావాలని, అందుకు పట్టణం, పల్లెల్లో దండారా వేయించి వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు.