పరిగి : పరిగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదుపాయాలు కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల భవనాలకు రంగులు వేయిస్తామని చెప్పారు. డిగ్రీ కళాశాలకు అవసరమైన 100 డ్యుయెల్ డెస్కులు, కంప్యూటర్లు, ఇతర ఫర్నీచర్ ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ నాయకులు ఆర్. ఆంజనేయులు, ప్రవీణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మంజులత, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, లెక్చరర్లు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎరగడ్డపల్లికి చెందిన చంద్రలీలకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరు చేయించిన రూ. 2లక్షల ఎల్వోసీ కాపీని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.