మర్పల్లి, నవంబర్ 4 : బీఆర్ఎస్పార్టీ తోనే తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సాధ్యమని వికారా బాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పిల్లిగుం డ్ల, గుండ్లమర్పల్లి, నర్సాపూర్ గ్రామాల్లో మండల నాయకులతో కలిసి ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని ప్రగతిబాటన నడిపించింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఏదో ఒక పథకం ప్రతి పేదోడి ఇంటికి చేరిందని తెలిపారు.. రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి బాధలు పడ్డామో అందరికీ తెలుసని, రాష్ట్రం ఏర్పడ్డకా పల్లెలన్నీ ప్రగతిబాటన పయనిస్తు న్నాయన్నారు.
మిషన్ భగీరథ నీటితో గ్రామా ల్లో నీటి గోస తీర్చిన గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం పిల్లగుండ్ల గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, బట్టు రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ యాద య్య, జిల్లా పబ్లిక్వాయిస్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఆయా గ్రామాల సర్పంచులు పాండు, శివకుమార్, పుష్పలత, సుధాకర్ రెడ్డి, నాయకులు పెద్ది అంజయ్య, శంకర్రెడ్డి పాల్గొన్నారు.
మరోసారి ఎమ్మెల్యేగా ఆనంద్ను గెలిపించుకుని వికారాబాద్ నియోజక వర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఆనంద్ సతీమణి డాక్టర్ సబిత అన్నారు. శనివారం మండలంలోని రొంపల్లి గ్రామంలో మండల నాయకులతో కలిసి ఆమె ఇం టింటి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు యాదవ్, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.