వర్షాలు కురుస్తుండడం.. సమయానికి రైతుబంధు డబ్బులు అందుతుండడంతో అన్నదాతలు సంబురంగా సాగుపనులు చేసుకుంటున్నారు. విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత వానకాలంలో 3.94,066 మంది రైతులకు రూ.378.95కోట్ల సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించి.. ఇప్పటివరకు 2,77,913 మంది రైతుల ఖాతాల్లో రూ.204.65 కోట్లను జమ చేసింది. సాయం అందుకున్న రైతన్నలు మురిసిపోతున్నారు. పంట పెట్టుబడి మొదలుకుని.. ధాన్యం కొనుగోలు వరకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలువడంపై హర్షం వ్యక్తం చేస్తూ అన్నదాతలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-రంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ) : రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీతో పాటు వర్షాలు కురుస్తుండటంతో రం గా రెడ్డి జిల్లాలో వ్యవసాయం జోరందుకున్న ది. పంటల సాగులో రైతన్నలు బిజీగా మా రారు. ప్రస్తుత వానకాలంలో 3,94,066 మంది రైతులకు రూ.378.95 కోట్ల సాయాన్ని అందించాలన్న సంకల్పంతో ప్ర భుత్వం జూన్ 26 నుంచి పెట్టుబడి సాయం పంపిణీని ప్రారంభించింది. ఇప్ప టివరకు జిల్లాలోని 2,77,913 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 204.65 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. సాయం పొందిన అన్నదాతల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. పంటల సాగుకు పెట్టుబడి సాయం మొదలుకుని..ధాన్యం కొనుగోలు వరకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో రైతు కుటుంబాలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నాయి. అదును కు పెట్టుబడి సాయం అందిస్తూ ఆదుకుం టున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
కొత్త వారికి కూడా..
ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా ప్రభుత్వం రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నది. కొత్తగా పొలాలు కొనుగోలు చేసిన వారు, గతంలో ఆధార్ కార్డు వంటి పత్రాలు సమర్పించని వారు …వివిధ కారణాలతో రైతుబంధు పొందని వారికి ఈసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ లెక్కన 39,967 మందిని అర్హులుగా తేల్చి న అధికారులు వారికి కూడా వానకాలం పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.