వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది, ప్రజలు సంక్రాంతి పండుగను శాంతి యుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలను ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు. ఒమిక్రాన్ కూడా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని సూచించారు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.