కొడంగల్ : ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఏర్పాట్ల చేస్తున్నట్లు తెలిపారు. ధనుర్మాస పూజ కార్యక్రమంలో ఆలయ పండితులు ఉ.ప.వే శ్రీనివాసాచార్యులు ఉత్తర ద్వార దర్శన విశేషాన్ని వివరించారు. వైకుంఠ ఏకాదశి రోజున మహా విష్ణువు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శణ భాగ్యం కలిగిస్తారని తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం.. పుణ్య సార్థకంగ భావించడం భక్తుల ప్రగాఢ నమ్మకంగా పేర్కొన్నారు.
ముక్కోటి దేవతలు యోగనిద్రలో ఉన్న మహావిష్ణువును దర్శించుకొని పుణీతులైనట్లు పురాణాల గాధ. కాబట్టే ముక్కొటి ఏకదశికి అత్యంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. 13వ తేదీన ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించేకోవడం జరుగుతుందన్నారు. ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారా నుంచి శ్రీవారిని దర్శించుకొని పుణీతులు కావాలని తెలిపారు.