బొంరాస్ పేట : టీకా తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని డిప్యూటీ డీఎంహెచ్వోలు ధరణి, రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను వారు పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, మొదటి డోసు తీసుకున్న వారు తప్పక రెండో డోసు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఫ్రంట్లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లకు బూస్టర్ డోసు టీకా అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని వారు కోరారు.
కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బుధవారం ఆశ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు గోపాల్, అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.