మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయ్యాయి. జిల్లాలో ఇదివరకు 969 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం మినీ కేంద్రాల అప్గ్రేడ్తో వీటి సంఖ్య 1107కు చేరింది. గిరిజన ప్రాంతాల్లో 300కు పైగా జనాభా, అర్బన్ ప్రాంతాల్లో 400కు పైగా జనాభా ఉన్న చోట్లలోని మినీ కేంద్రాలను ప్రభుత్వం ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసింది. ఫలితంగా ఇందులో పనిచేసే టీచర్ల వేతనం పెరుగడంతో పాటు ప్రతి కేంద్రానికీ సహాయకురాలిని నియమించనున్నారు.
-బొంరాస్పేట, డిసెంబర్ 28
బొంరాస్పేట, డిసెంబర్ 28 : మినీ అంగన్వాడీ కేంద్రాలకు మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా అప్డ్రేడ్ అయ్యా యి. జిల్లాలో ఇప్పటివరకు 969 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మినీ కేంద్రాల అప్గ్రేడ్తో వీటి సంఖ్య 1,107 చేరింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు హర్షం వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో గిరిజన ప్రాంతాల్లో 300 పైగా జనాభా, అర్బ న్ ప్రాంతాల్లో 400 పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మినీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ఫలితంగా వీటిలో పనిచేసే టీచ ర్ల వేతనం పెరగడంతో పాటు ప్రతి కేంద్రానికి సహాయకురాలిని నియమించనున్నారు.
పదేండ్లుగా కొనసాగుతున్న మినీ అంగన్వాడీ కేంద్రాలు పెరిగిన జనాభా ప్రాతిపదికన ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభు త్వం గతంలో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చిం ది. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్, మర్పల్లిలో ఐసీడీఎస్ ప్రా జెక్టులు ఉండగా వీటి పరిధిలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మినీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ అయ్యా యి. కొడంగల్ ప్రాజెక్టు పరిధిలో 8, మర్పల్లిలో 17, పరిగిలో 74, తాండూరులో 20, వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలో 19 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
పదేండ్ల క్రితం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ జనాభా ఉండడం, రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో నాటి ప్రభు త్వం ఆయా ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పడు వాటి పరిధిలో జనాభా, కుటుంబాలు పెరగడంతో మినీ కేంద్రాల నుంచి సేవలు అందించడం కష్టతరంగా మారింది. వాటిని మె యిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని వచ్చి న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే ఉంటారు. హెల్పర్ ఉండరు. దీంతో అన్ని పనులు టీచరే చేయాల్సి వస్తుంది. మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయితే ప్రభుత్వం వీటికి హెల్పర్ పోస్టులను మంజూరు చేసి నియమిస్తుంది. దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్ మెయిన్ కేంద్రాల్లో ఉండే టీచర్ మాదిరిగా అన్ని పనులు చేస్తున్నా వారికి వేతనం మాత్రం తక్కువ వచ్చేది. ప్రధాన కేంద్రాల్లో పని చేసే టీచర్కు నెలకు వేతనం రూ.13,650 ఉండగా, మినీ కేంద్రంలోని టీచర్కు రూ.7800 మాత్రమే. అప్గ్రేడ్తో మినీ కేంద్రాల టీచర్ల వేతనం కూడా పెరిగి వారికి ప్రయోజనం కలుగుతున్నది. ప్రధాన కేంద్రాలుగా మారనున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఇంటర్ విద్యార్హత ఉన్న వారు టీచర్లుగా కొనసాగుతారు. ఇంటర్ అర్హత లేని వారు హెల్పర్లుగా కొనసాగుతారు. దీని ఆధారంగా ఖాళీలను గుర్తించి ఎక్కడెక్కడ టీచర్లు, హెల్పర్లు అవసరమో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపడుతారు.
జిల్లాలో 138 మినీ అం గన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం అప్గ్రేడ్ చే సింది. ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ని ర్ణయం తీసుకున్నది. అ ప్గ్రేడ్ అయిన కేంద్రా ల్లో టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీకి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తాం.
– లలితాకుమారి, సంక్షేమ శాఖ జిల్లా అధికారి, వికారాబాద్