శంకర్పల్లి : గుర్తు తెలియని దుండగులు టెంట్హౌజ్ను తగులబెట్టిన సంఘటన శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని జనావడలో తలారి బాగయ్య కుటుంబం టెంట్హౌజ్ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి టెంట్హౌజ్ షెటర్ను తగులబెట్టగా సుమారు రూ. 25లక్షల టెంట్హౌజ్ సామగ్రి కాలి బూడిద అయ్యింది. చుట్టు పక్కల వారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. కాగా నార్సింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడు తలారి బాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.